మనుబోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఎంపీపీ గుండాల వజ్రమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశంలో కొందరు ఎంపీటీసీలు సర్పంచులు గైర్హాజరు పైన వైస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచులు ఎంపీటీసీలు ఈసారి జరిగే మండల మీట్లో తప్పక హాజరు కావాలని ఎంపిపి వజ్రమ్మ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.