అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు
విదవలూరు మండలం చెలికల గ్రామంలో సోమవారం అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించడం జరిగింది. తక్కువ ఖర్చుతో కూడిన ఆకుకూరలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయని ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణి అన్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.