తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలుపుకు అందరూ కృషి చేయాలని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరువూరు పట్టణ పరిధిలోని 18 వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తో కలిసి నిర్వహించారు. వైసిపి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ పార్టీకే ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాయకులు పాల్గొన్నారు.