AP: నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కృష్టా జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వెంకటరమణ కోసం గాలిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో ఆయన ఆత్మహత్య చేసుకోవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫెర్రీ బకాయిలు రూ.55 లక్షలను వైసీపీ నేతల అండతో కాంట్రాక్టర్ చెల్లించకపోవడంతో తనను బాధ్యుడిని చేస్తారనే భయంతో MPDO అదృశ్యమైనట్లు సమాచారం.