పవిత్రమైన రంజాన్ ను సంతోషంగా జరుపుకోవాలి

83చూసినవారు
పవిత్రమైన రంజాన్ ను సంతోషంగా జరుపుకోవాలి
పవిత్రమైన రంజాన్ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని యడ్లపాడు మండల తహసీల్దార్ ఆశ్రపున్నిసా బేగం చెప్పారు. బుధవారం యడ్లపాడు మండలంలోని విఆర్వోల సంఘం సభ్యులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సామరస్యంతో మెలగాలని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోల సంఘం అధ్యక్షుడు చారి, ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్