రాబోయే ఎన్నికల్లో టిడిపి,
జనసేన అధికారంలోకి వచ్చాక గురజాల నియోజకవర్గంలో యువతీ, యువకులకు ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాలలో వాగ్దేవి కాలేజీలో శనివారం యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఉద్యోగం లేని యువతీ, యువకులు ఉండకూడదని అన్నారు.