రెంటచింతలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్

72చూసినవారు
రెంటచింతలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
రెంటచింతల మండల కేంద్రంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ పనులు నిర్వహించారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా మండల పరిషత్ అధికారులు రెంటచింతలలోని పలు కాలనీలలో మురుగు కాలువ పూడిక తీత పనులను చేపట్టారు. అనంతరం వీధిలో బ్లీచింగ్ చల్లారు. దోమలు బారిన పడకుండా ఉండేందుకు నీరు నిల్వ ఉండకుండా చూడాలని వారు కోరారు.