గజపతినగరం: పిల్లల చదువుపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి

72చూసినవారు
గజపతినగరం: పిల్లల చదువుపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
పిల్లల చదువుపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఎస్. ఎం. సి చైర్మన్ గండ్రేటి అనసూయ అన్నారు. గజపతినగరం మండలంలోని పురిటిపెంట రెగ్యులర్ పాఠశాలలో సోమవారం ఎస్ఎంసి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రేజేటి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్