స్వచ్ఛత హి సేవా ర్యాలీని ప్రారంభించిన ఒంగోలు కలెక్టర్

83చూసినవారు
ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద స్వచ్ఛత హి సేవా ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి నగర మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవలో భాగంగా జిల్లాలో పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్