కొమరోలు: ఘనంగా రథోత్సవం

77చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం శనివారం ఘనంగా జరిగింది. రథంపై సతీసమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు కొలువు తీరాడు. స్వామివారిని భక్తులు దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. బస్టాండ్ ఆవరణ నుంచి భారీ రథాన్ని తాళ్లతో భక్తులు లాగి భక్తిని చాటుకున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రథోత్సవాన్ని నిర్వహించినట్లుగా వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్