
గిద్దలూరు: జడ్పీటీసీని సన్మానించిన టీడీపీ నాయకులు
గిద్దలూరు జడ్పీటీసీ మధుసూదన్ ను సోమవారం టీడీపీ నాయకులతో కలిసి మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలయ్య ఘనంగా సన్మానించారు. ఇటీవల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎంపికైన బాలయ్య, టీడీపీ నాయకులు కార్యకర్తలు జెడ్పీటీసీని కలిసి అభినందనలు తెలిపారు. బాలయ్యకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రావడంలో కీలక పాత్ర పోషించిన జడ్పీటీసీ మధుసూదన్ కు కృతజ్ఞతలు తెలిపారు.