పలువురుని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి
కొనకనమిట్ల మండలంలోని బురదపాలెం గ్రామానికి చెందిన పగడాల ఏడుకొండలు కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అదే గ్రామానికి చెంది అనారోగ్యంతో బాధపడుతున్న పగడాల కోటయ్యని పరామర్శించారు. చింతకుంట గ్రామానికి చెంది అనారోగ్యంతో బాధపడుతున్న వేమన కాశిరెడ్డిని, మార్కాపురం చినకాశయ్యని పరామర్శించారు.