మీరట్ మర్డర్ కేసులో ట్విస్ట్.. జైలులో గర్భిణిగా తేలిన నిందితురాలు

59చూసినవారు
మీరట్ మర్డర్ కేసులో ట్విస్ట్.. జైలులో గర్భిణిగా తేలిన నిందితురాలు
మీరట్‌లోని మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో సంచలన మలుపు తిరిగింది. ప్రధాన నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భవతిగా నిర్ధారణ అయింది. జైలు అధికారుల అభ్యర్థనపై జిల్లా ఆసుపత్రి బృందం జైలులో ఆమెను పరీక్షించగా, ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. 2016లో ప్రేమ వివాహం చేసుకున్న ముస్కాన్, సౌరభ్‌కు ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. డ్రగ్స్‌కు బానిసైన ముస్కాన్, సాహిల్ ఇద్దరూ సౌరభ్‌ను హత్యచేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్