పామూరు మండలంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
పామూరు మండలంలో ఆదివారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో ఎవరు ఇల్లు విడిచి బయటకు రావద్దని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల పామూరు పట్టణంలోని పలు ప్రధాన రహదారులునిర్మానుష్యంగా ఉన్నాయి.