అంగరంగ వైభవంగా అద్దంకి నాంచారమ్మ తిరునాళ్ళ

56చూసినవారు
పర్చూరులో మహిమాన్వితగా పేరొందిన అద్దంకి నాంచారమ్మ శిడిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుండి అమ్మవారికి విశేషాలంకారాలు అభిషేకాలు పూజలు నిర్వహించారు. సాయంత్రం శిడిమానోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ యువకులు కేరింతలు కొడుతూ కర్రసాములు చేశారు. రాత్రి తిరునాళ్ళ ప్రారంభమైంది. పరిసర ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పర్చూరు ఎస్సై రమేష్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్