ఏపీకి శుభవార్తను వినిపించిన రైల్వే అధికారులు

1578చూసినవారు
ఏపీకి శుభవార్తను వినిపించిన రైల్వే అధికారులు
ఏపీలోని రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు ఎంత ఆదాయం వస్తుందనే విషయాన్ని పరిశీలించిన తర్వాత సంతృప్త స్థాయిలో ఉంటే హాల్టింగ్ ను పొడిగిస్తారు. లేదంటే కేవలం ఆరు నెలలకు లేదంటే ఏడాది కాలం వరకు పరిమితం చేస్తారు. ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ లోపు దశలవారీగా హాల్టింగ్ సౌకర్యం ప్రారంభమవుతుంది.