ఏపీ హోంశాఖ కీలక నిర్ణయం

80చూసినవారు
ఏపీ హోంశాఖ కీలక నిర్ణయం
ఏపీ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు.. శిక్షా సమయంలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించింది. జైలులో తోటి ఖైదీలతో ఘర్షణ, సిబ్బంది వేధింపులతో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించనుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఖైదీ మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా రూ.3.5 లక్షలు చెల్లించనుంది.

సంబంధిత పోస్ట్