ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఏపీ నుంచి తనను రిలీవ్ చేయాలని కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతానికి రిలీవ్ చేయబోమని ప్రభుత్వం.. విజయ్ కుమార్కు తేల్చి చెప్పింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ యధాస్థితిలో కొనసాగాలని కమీషనర్కు ఆదేశాలు జారీ చేసింది.