పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

63చూసినవారు
పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణ చేసింది. అక్టోబర్ 1న సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. 2వ తేదీన మిగిలిన వారికి పింఛన్ పంపిణీ అందించాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే 100 శాతం పింఛన్ అందించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్