లైంగిక దాడికి పాల్పడిన ఏలూరులోని వసతి గృహం నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలికలు

85చూసినవారు
లైంగిక దాడికి పాల్పడిన ఏలూరులోని వసతి గృహం నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలికలు
ఏలూరులోని బాలికల వసతి గృహం నిర్వాహకుడు శశికుమార్ తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని ముగ్గురు బాలికలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతులు కట్టేసి మరీ లైంగిక దాడికి పాల్పడేవాడని, తమని దారుణంగా కొట్టేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫొటోషూట్ పేరుతో ఈ నెల 15న ఓ బాలికని తీసుకెళ్లి అత్యాచారం చేశాడని అన్నారు. ఈ వసతి గృహంలో సుమారు 50 మంది బాలికలు ఉండగా, ఎందరు వేధింపులకు గురయ్యారో తెలుసుకుంటున్నాం అని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్