మాజీ సీఎం జగన్‌పై షర్మిల ఫైర్

65చూసినవారు
మాజీ సీఎం జగన్‌పై షర్మిల ఫైర్
కేంద్రంలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌తో ఏపీకి పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఎన్టీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై జగన్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ ఎందుకు ధర్నా చేయలేదని మండిపడ్డారు. పార్టీ ఉనికి కోసం జగన్ ఇప్పుడు ఢిల్లీ డ్రామాలు మొదలు పెట్టారని ఆరోపించారు.