వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు

63చూసినవారు
వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక పలు ప్రాంతాల ప్రజలు వరదలో చిక్కకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఒకరోజు వేతనంని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ మంగళవారం ఉదయం ప్రకటించింది. జేఏసీ ప్రకటించిన మొత్తం విరాళం రూ.100 కోట్లు ఉంటుంది.

సంబంధిత పోస్ట్