పాల కొరత.. అర లీటర్ ప్యాకెట్ రూ.80

52చూసినవారు
పాల కొరత.. అర లీటర్ ప్యాకెట్ రూ.80
భారీ వర్షానికి వరదలో మునిగిన విజయవాడలో పాల కొరత ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు అమాంతం పాల రేట్లు పెంచేశారు. అర లీటర్ పాల ప్యాకెట్ ధర రూ.70-80 వరకు విక్రయిస్తున్నారు. ఇళ్లలో పిల్లలు ఉన్నారని, కనీసం ఒక్క ప్యాకెట్ అయినా పాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాగా, విజయ డెయిరీ, కృష్ణ మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీసులు నీటి మునిగాయి. దాదాపు లక్షల లీటర్ల పాలు, పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి. దాంతో పాల కొరత తీవ్రమైంది.

సంబంధిత పోస్ట్