సీఎం జగన్‌పై దాడి కేసులో షాకింగ్ నిజాలు

56916చూసినవారు
సీఎం జగన్‌పై దాడి కేసులో షాకింగ్ నిజాలు
సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఏ1గా సతీష్, ఏ2గా దుర్గారావును పోలీసులు నిర్ధారించారు. అయితే సీఎం జగన్‌పై దాడికి పాల్పడ్డ రోజే నిందితుడు సతీష్ పుట్టినరోజు. బర్త్ డే వేడుకకు సతీష్‌కు డబ్బులు అవసరమయ్యాయి. అది గుర్తించిన దుర్గారావు.. సతీష్‌తో దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డబ్బు కోసం సతీష్ దాడికి సిద్ధమయ్యాడట. ఇవాళ లేదా సోమవారం నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.