విద్యా కిట్లు పంపిణీ చేసిన కోవూరు ఎమ్మెల్యే

77చూసినవారు
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని మినగల్లు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా కిట్లును పంపిణీ చేశారు. కాసేపు విద్యార్థులతో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్