ధర్మవరంలోని కొత్తపేటలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది సందర్భంగా బుధవారం శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య ప్రదర్శన నిర్వహించారు. ఆచార్యులు బాబు బాలాజీ మాట్లాడుతూ. కమల బాలాజీ, రామలాలిత్య శిష్య బృందం 50 మంది బాల కళాకారులుతో నాట్య ప్రదర్శన చేశామన్నారు. గణపతి, నటరాజ, వెంకటేశ్వర, అలమేలు మంగ, రాముడు, కృష్ణుడు, దత్తాత్రేయుని వర్ణిస్తూ 21 నాట్య ప్రదర్శన చేశారు.