ధర్మవరం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రిమాండ్ లో ఉన్న వైసీపీ కార్యకర్తలను చూసేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం సాయంత్రం స్థానిక సబ్ జైలుకి వెళ్లారు. సబ్ జైలు వద్దకు జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు భారీగా తరలిరాగా. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది