ఇలియాజ్ సేఠ్ కు కన్నీటి వీడ్కోలు

611చూసినవారు
ఇలియాజ్ సేఠ్ కు కన్నీటి వీడ్కోలు
అనారోగ్యంతో మృతి చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఇలియాజ్ సేఠ్ అంత్య క్రియలు గురువారం హిందూపురం పట్టణంలోని శ్మశానవాటికలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు ఎంపీ గోరంట్ల మాధవ్, హిందూపురం ఎంపీ వైఎస్సార్సీపీ అభ్యర్థి బి. శాంతమ్మ, దీపిక పలువురు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్