సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

1555చూసినవారు
సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నల్లచెరువు మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సర్వసభ్య సమావేశంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి శనివారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరైన నిధులతో చేపట్టిన పనులు గురించి అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్