గాండ్లపెంట మండలంలో విస్తారంగా కురిసిన వర్షాలు
శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలోని చామాల గొంది గ్రామంలో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిసాయి. ఉదయం నుండి 2 గంటలు పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్లన్ని జలమయం అయ్యాయి. రహదారులన్ని జలమయం కావడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. సకాలంలో వర్షాలు పడడంతో రైతులు పంట పొలాలను దుక్కి దున్నుకోవాడానికి మంచి అవకాశం కలిగిందని రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు.