శ్రీసత్యసాయి జిల్లా, అమరాపురం మండలం మద్దనకుంటలొ వాహనాలు తనిఖీలు చేస్తుండగా గురువారం రాత్రి 38 లక్షలు పోలీసులు పట్టుకున్నారు. సిఐ రాజకుమార్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం పావగడ కు చెందిన మంజునాథ్ రూ.38 లక్షలు తుంకూర్ నుండి మరిదాసన హళ్లి గ్రామానికి అమరపురం గుండా తరలిస్తుండగా మార్గమధ్యంలో పట్టుకున్నట్లు తెలిపారు. ఆధారాలు చూపించనందున నగదును సీజ్ చేశామని తెలిపారు.