పెనుకొండలో సంబరాలు చేసుకున్న టీడీపీ నాయకులు

81చూసినవారు
పెనుకొండలో సంబరాలు చేసుకున్న టీడీపీ నాయకులు
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఎన్ టి ఆర్ సర్కిల్ లో గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి బాణా సంచా కాల్చారు. రాష్ట్ర బీసి సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, వస్త్రాలు శాఖ మంత్రిగా సవితమ్మ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవనాయుడు, గుట్టూరు సూరి, బాబుల్ రెడ్డి, త్రివేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్