లావేరు మండలం చిన్నమురపాక సచివాలయం పరిధిలోని 15మంది గ్రామ వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు వ్యతిరేకంగా స్వచ్చందంగా బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్బంగా వాలంటీర్లు మాట్లాడుతూ. సీఎం జగన్ పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరించి, రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లావేరు మండల జడ్పీటీసీ మీసాల సీతంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.