కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని శనివారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేపట్టి, స్వామివారి తీర్దప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.