వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం జగన్మోహన్ రెడ్డిని మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కలిసి, నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సరళిపై చర్చించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.