జి. సిగడాం మండలంలోని ఆనందపురంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని నాయకులు హాజరై కూటమి అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.