బుడుమూరు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు చేరాలి

67చూసినవారు
బుడుమూరు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు చేరాలి
ఎచ్చెర్ల మండలం బుడుమూరు గ్రామంలో గల విద్యార్థులు అందరూ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చేరాలని మంగళవారం ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కోరారు. పదవ తరగతిలో 23 మంది ప్రధమ శ్రేణి లో ఉతీర్ణులైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్. కె. ప్రసాదరావు, పి. గోవిందరావు, కె. వెంకటరావు, ఎస్. రమేష్ బాబు, ఎస్. చంద్రశేఖర్ పాల్గొన్నారు.