సీఎం జగన్ హయాంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం జలుమూరు మండలం దరివాడ పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. నరసన్నపేట నియోజకవర్గంలో రహదారులతో పాటు, తాగునీరు అన్ని గ్రామాలకు అందించగలిగామని చెప్పారు. రానున్న ఎన్నికలలో వైసీపీని గెలిపించాలని ప్రజలను కోరారు.