గుర్రపు డెక్క తొలగింపు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

55చూసినవారు
ఎచ్చెర్ల మండలం పెయ్యలవానిపేట గ్రామంలోని కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శుక్రవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గంలోని శివారు భూములకు సైతం సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ విశ్వక్షేన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్