శ్రీరంగ స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

65చూసినవారు
ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలోని స్థానిక శ్రీరంగ స్వామివారిని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్