డయేరియా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

79చూసినవారు
జి. సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో డయేరియా వ్యాధితో బాధపడుతూ పలువురు బాధితులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ముందుగా వారి ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్