సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలి

55చూసినవారు
రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామ సచివాలయాన్ని స్థానిక సర్పంచ్ ప్రతినిధి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు బస్వ గోవిందరెడ్డి శనివారం సందర్శించారు. ముందుగా సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశయ్యారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించి, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సచివాలయంలో అన్ని సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్