స్టడీ మెటీరియల్ విద్యార్థులకు వితరణ

72చూసినవారు
స్టడీ మెటీరియల్ విద్యార్థులకు వితరణ
కవిటి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు విశ్రాంత ప్రిన్సిపాల్ ప్రగడ వెంకటరమణ బోటనీ స్టడీ మెటీరియల్ ను వితరణ చేశారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రాజేశ్వరరావు చేతులమీదుగా 61 మంది బాల, బాలికలకు బుధవారం అందించారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం గొండ్యాల విష్ణుమూర్తి, పోలాకి హరి, మాదిన అన సూయమ్మ, కరుణశ్రీ ఉన్నారు.

సంబంధిత పోస్ట్