ఘనంగా శ్రీసింధు పోలమ్మ తల్లి సంబరం

81చూసినవారు
కంచిలి మండలంలోని ఎక్కల గ్రామంలో మంగళవారం శ్రీ సింధు పోలమ్మతల్లి సంబర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఘటాన్ని మంగళ వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక, భజన కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మరోవైపు మహిళా భక్తులు పూనకాలతో అమ్మవారి మహిమను తెలియజేశారు. సంబర మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్