కంచిలిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

59చూసినవారు
కంచిలి మండలంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మకరాంపురం గ్రామంలో వెలసియున్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయం వద్ద గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 3, 000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్