సోంపేటలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

70చూసినవారు
సోంపేట మండలంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సోంపేట మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ మిషన్ మఠంలో గురుపౌర్ణమి పూజ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు గురుపౌర్ణమి ప్రత్యేకతను భక్తులకు వివరించారు. అనంతరం మఠంలో అష్టోత్తరాలు, హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్