కురిసిన వర్షాలు.. నిండిన చెరువులు

54చూసినవారు
కంచిలి మండలంలోని కర్తలి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులలో నీరు చేరడంతో చెరువుకు జలకల వచ్చింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభించారు. పొలాలకు గట్లు వేయటం తదితర పనులలో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. గత ఏడాది వరి పంటలు అంతంత మాత్రం గానే పండడంతో ఈసారైనా సుభిక్షంగా పంటలు పండాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్