ఈదుపురంలో టిడిపి ఇంటింటా ప్రచారం

79చూసినవారు
ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం గ్రామంలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ బెందాళం అశోక్ మంగళవారం ‌ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓటు వేసి తనను, ఎంపీ రామ్మోహన్ నాయుడును గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను అశోక్‌ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ రాజు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.