పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే

55చూసినవారు
పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతుశిరీష పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన ప్రకారం పెంచిన 4000తో పాటు ఏప్రిల్ నుండి బకాయి పడిన మూడు నెలల వెయ్యి రూపాయలు చొప్పున 7వేల రూపాయలను వృద్ధులకు, ఒంటరి మహిళలకు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సూరి తేజ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్