ఏఓబీలో 22, 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

68చూసినవారు
ఏఓబీలో 22, 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
మెళియాపుట్టి మండలంలోని ఏఓబీ సరిహద్దు భరణికోట పంచాయతీ మర, బాలేరు, ఒడి శాలోని మర్రిగుడ్డి, కొయ్యార గ్రామాల్లో సారా తయారీ స్థావరాలపై మంగళవారం పలాస డీటీఎఫ్, ఎస్ఈబీ, ఇంటెలిజెన్స్ బృందాలు మెళియాపుట్టి పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించారు. 22, 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 500 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. సీఐలు రామచంద్ర కుమార్, రాజశేఖర్ నాయుడు, మెళియాపుట్టి ఎస్సై రాజేష్ పాల్గొన్నారు.